వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిమొళి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం 14వ తేదీకి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో నిందితురాలు, డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి బెయిల్ పిటిషన్ నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కేసును తిరిగి ఈ నెల 14వ తేదీన చేపట్టనున్నట్లు సిబిఐ న్యాయమూర్తి ఒపి సైనీ శనివారం చెప్పారు. కనిమొళి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై అంతకు ముందు వాదనలు జరిగాయి.

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌తో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి ప్రత్యక్ష సంబంధం ఉందని సిబిఐ వాదించింది. ముందస్తు బెయిల్ ‌కోసం కనిమొళి పెట్టుకున్న దరఖాస్తుపై సిబిఐ కోర్టులో శనివారం వాదనలు జరిగాయి. కనిమొళి టెలికం మాజీ మంత్రి, స్కామ్ నిందితుడు ఎ. రాజాను కనిమొళి సంప్రదించేవారని చెప్పింది. కలైంగర్ టీవీని నియంత్రించే ప్రధాన వ్యక్తి కనిమొళి అని చెప్పింది. కలైంగర్ టీవీ రూపకల్పనలో కనిమొళిది ప్రధాన పాత్ర అని చెప్పింది. లెక్కాపత్రం లేకుండా 214 కోట్ల రూపాయలను కలైంగర్ టీవీకి బదలాయించారని ఆరోపించింది.

తనను అరెస్టు చేస్తారా అనేది తనకు తెలియదని కనిమొళి అన్నారు. పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కనిమొళి తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదిస్తున్నారు. కలైంగర్ టీవీకి డబ్బులు బదిలీ అయిన వ్యవహారంలో కనిమొళికి సంబంధం లేదని జెత్మాలనీ అన్నారు. కనిమొళి ఏ విధమైన నేరం చేయలేదని, ఆమె టీవీ చానెల్ వాటాదారు మాత్రమేనని చెప్పారు. కుట్ర పాత్రధారి రాజా మాత్రమేనని, కనిమొళి కారని ఆయన అన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కనిమొళి కోర్టుకు హాజరయ్యారు.

English summary
A special Central Bureau of Investigation (CBI) court on Saturday reserved for a week its decision on the bail plea by DMK MP Kanimozhi, named a co-conspirator in the 2G spectrum allocation case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X