కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సాక్షి రిపోర్టర్లలో గుండాలు, వారి నుండి ప్రాణహాని ఉంది: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నుండి తనకు ప్రాణహాని ఉందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు చెందిన సాక్షిలో పని చేస్తున్న కొందరు గూండాలు, రౌడీలు రిపోర్టర్లు, ప్రెస్ పేరుతో పోలింగ్ బూతులలోకి వెళుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ గూండాలు నుండి తనకు ప్రాణ హానీ ఉందని అన్నారు. వారి నుండి తనకు ఏమైనా ప్రాణహానీ జరిగితే దానికి బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ, పోలింగ్ అధికారులు, పోలీసులదే అని అన్నారు. వైయస్ జగన్ వర్గం భారీగా రిగ్గింగులకు పాల్పడుతుందని అన్నారు.

ప్రెస్ పేరుతో యథేచ్ఛగా పోలింగ్ బూతులలోకి వెళ్లడం, తనకు ప్రాణహాని విషయాలపై ఎన్నికల సంఘాన్ని కలిశానని చెప్పారు. ఓటరు సంతకం పెట్టిన తర్వాత ఓటు వేయాలి. కానీ అలా జరగటం లేదన్నారు. ప్రీసిడింగ్ అధికారి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాగే ఎన్నికలకు జరుగుతే కనుక అవి స్వేచ్ఛా పూర్వక ఎన్నికలు కావని అన్నారు.

English summary
Minister DL Ravindra Reddy alleged that he is threat from EX MP YS Jaganmohan Reddy camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X