హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను ముందు జైలులో పెట్టాలి, శ్రీకృష్ణది పెద్ద అవినీతి: మధు యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: 2జి స్పెక్ట్రం అవినీతి రాజా, కామన్వెల్తు అవినీతిపరుడు సురేష్ కల్మాడిలకంటే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముందుగా జైలులో పెట్టాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గురువారం అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలో అవినీతితో కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

ప్రత్యేక తెలంగాణ ఆందోళన తదితర విషయాలపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు. దేశంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయన్నారు. అయితే అన్నింటికన్నా అతిపెద్ద అవినీతిపరులు శ్రీకృష్ణ కమిటీయే అన్నారు. 14 ఎఫ్ పై రాష్ట్రం మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ఫ్రీజోన్ అంశం తేలాకే ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించాలని కోరారు.

English summary
Nizamabad MP Madhu Yashki accused that Ex MP YS Jaganmohan Reddy is biggest corruptionist. He was demand to put Jagan in jail. He said governor gave wrong report to centre on Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X