హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కడప ఉప ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుందని, అలా తీసుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ బలహీనపడలేదని ఆయన అన్నారు. కడప జిల్లాలనే కాదు, అన్ని జిల్లాల్లోనూ పార్టీ పునాదులపై దృష్టి పెడతామని ఆయన అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తాము తొలగించలేకపోయామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తాము గట్టిగా తిప్పికొట్టలేకపోయామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై, పార్టీపై ప్రజల విశ్వసనీయతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి, పార్టీ నాయకత్వానికి చెబుతానని ఆయన అన్నారు. సెంటిమెంట్ బలంగా పనిచేసే ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

English summary
Minister Botsa Satyanarayana said that it is not necessary to take bypolls seriously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X