హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌తో మళ్లీ వెళ్లేది లేదు: బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kamalamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో మళ్లీ వెళ్లేది లేదని కడప జిల్లా బద్వేలు శానససభ్యురాలు కమలమ్మ స్పష్టం చేశారు. ఆమె శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగానే తాను ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ సానుభూతి ఎంత కాలం ఉంటుందో చూడాలని ఆమె అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

తన శాసనసభా నియోజకవర్గం బద్వేలులో మరో పార్టీ నేత ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఉప ఎన్నికలకు ముందు కమలమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి కాంగ్రెసు పార్టీలోకి వెనక్కి వచ్చారు. కమలమ్మ తిరిగి కాంగ్రెసులోకి వెళ్లకుండా చూసేందుకు వైయస్ జగన్ వర్గం తీవ్రంగానే ప్రయత్నించారు. అయినా ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండకుండా వెనక్కి వచ్చారు. కడప లోకసభ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌కు బద్వేలు శాసనసభా నియోజక వర్గంలో 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీ లభించింది.

English summary
Congress Badwel MLA Kamalamma clarified that she will not go back to YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X