హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంటిమెంటు వల్లనే వైయస్ జగన్ గెలిచారు: మంత్రి శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shailajanath
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ గెలిచారని మంత్రులు అంటున్నారు. వైయస్సార్ రాజశేఖర రెడ్డిపై ఉన్న సానుభూతి వల్ల, వైయస్సార్ కుటుంబ సభ్యుడు కావడం వల్ల వైయస్ జగన్ విజయం సాధించారని మంత్రి శైలజానాథ్ అన్నారు. వైయస్ జగన్ ప్రభంజనం వల్ల కాంగ్రెసు పునాదులు కదలలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు కాంగ్రెసును అభిమానించారని ఆయన అన్నారు. తాము వైయస్సార్ ఫొటో పెట్టుకుంటామని ఆయన చెప్పారు. ఇతర కాంగ్రెసు నాయకుల ఫొటోలతో పాటు వైయస్ ఫొటోను కూడా తాము పెట్టుకుంటామని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి వల్లనే వైయస్ జగన్ గెలిచారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సానుభూతి వల్ల గెలిచారు తప్ప మరోటి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. డబ్బు పంచడం వల్ల వైయస్ జగన్‌కు భారీ మెజారిటీ వచ్చిందని ఆయన అన్నారు. జగన్ విజయం వల్ల కాంగ్రెసుకు కలిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.

English summary
Ministers Shailajanath and Anam Ramnarayan Reddy said that YS Jagan won due to YSR sentiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X