చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలితను కలిసిన రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aishwarya-Soundarya
చెన్నై: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, చిన్న కూతురు సౌందర్య శనివారం అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను పోయెస్ గార్డెన్‌లో కలిశారు. ఐశ్వర్య తన భర్త ధనుష్‌తో కలసి వెళ్లి అన్నాడీఎంకే అధినేత్రి జయకు శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగంగా అన్నాడీఎంకేకు ఓటేసిన రజనీకాంత్, శుభాకాంక్షలు చెప్పేందుకు ఐశ్వర్యను పంపినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తన తండ్రి అస్వస్థత కారణంగా రాలేకపోయారని జయకు చెప్పినట్లు సమాచారం.

కాగా రజనీకాంత్ మళ్లీ అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం శనివారం సాయంత్రం ఆయన్ను డిశ్చార్జి చేశారు. గత నెల 29వ తేదీన రాణా చిత్రం ప్రారంభోత్సవంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ నెల 4వ తేదీన రెండవ సారి జ్వరం, దగ్గు కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు.

English summary
Superstar Rajinikanth's daughters Aishwarya and Soundarya, met AIADMK chief Jayalalitha and congratulated her for her landslide victory in TN assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X