కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో వైయస్ జగన్ 48 గంటల రైతు దీక్ష ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: రైతుల సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష త్వరలో ప్రారంభం కానుంది. కడప పార్లమెంటు నుండి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచిన అనంతరం ఆయన చేస్తున్న మొదటి దీక్ష కావడం విశేషం. ఆదివారం ఏ సమయానికి అయితే దీక్షను ప్రారంభిస్తారో, మంగళవారం అదే సమయానికి ఆయన దీక్షను విరమిస్తారని తెలుస్తోంది. కాగా రైతుదీక్షా ప్రాంగణానికి చేరుకునేందుకు ఒంగోలు నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి భారీగా అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. రైతులతో పాటు పెద్ద ఎత్తున అభిమాన యువత, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఇప్పటికే ఒంగోలు నుంచి వస్తుండగా మార్గమధ్యంలో అనేకచోట్ల అభిమానులు, ప్రజలు ఆపడంతో యువనేత ప్రయాణం రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. చిలకలూరి పేట రహదారులన్నీ జగన్ అనుకూల నినాదాలు, వైఎస్సార్ పార్టీ జెండాల రెపరెపలతో కిటకిటలాడుతున్నాయి. రైతుల జగనిన్నాదంతో చిలకలూరిపేట మారుమ్రోగింది.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy will start his rythu deeksha within.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X