గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్షకు 17 మంది శాసనసభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు‌: రైతు సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సోమవారం 17 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. ఆదివారం ఏడుగురు శాసనసభ్యులు మాత్రమే హాజరు కాగా, సోమవారం 17 మంది హాజరు కావడం విశేషం. నలుగురు కాంగ్రెసు ఎమ్మెల్సీలతో పాటు ఓ వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్సీ కూడా జగన్ దీక్షకు వచ్చారు. కాంగ్రెసు ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి, కొండా మురళి దీక్షకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి కూడా దీక్షకు వచ్చి మద్దతు తెలిపారు.

రైతు సమస్యలపై వైయస్ జగన్ చేపట్టిన 48 గంటల దీక్ష రేపు మంగళవారం ముగుస్తుంది. ముగింపు సమావేశానికి ఎంత మంది శాసనసభ్యులు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్‌కు దాదాపు 27 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని భావిస్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైయస్ జగన్ చేపట్టిన మొదటి ఆందోళనా కార్యక్రమం ఇది. కాంగ్రెసు శానససభ్యులు కృష్ణదాస్, కొర్ల భారతి, బాబూరావు వైయస్ జగన్ దీక్షకు వచ్చి మద్దతు తెలిపారు.

English summary
17 MLAs attended YSR Congress leader YS Jagan's fast today at Guntur. Jagan fast will end tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X