హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆజాద్‌కు సొంత జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరుకు చెందిన శాసనసభ్యులే రాష్ట్ర వ్యవహారాల పరీశీలకుడు, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, షాజహాన్ పాషాలు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేలు సిఎం వైఖరిని నిరసిస్తూ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఓ లేఖను కూడా ఇచ్చారు.

కిరణ్ వ్యవహార శైలి సరిగా లేదని వారు చెప్పారు. ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రికి సొంత జిల్లాలోనే మద్దతు లేదని అందరినీ కలుపుకొని పోవడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా అన్నారు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి సిఎం వైఖరే కారణమని ఆయన అన్నారు.

English summary
Chittoor district MLAs Peddireddy Ramachandra Reddy, Shajahan Pasha, Ravi were complainted against CM Kiran Kumar Reddy to Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X