హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన తల్లి, చిన్న కూతురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఓ తల్లి తీవ్ర ఘాతుకానికి పాల్పడింది. తన ఇద్దరు కూతుళ్ల గొంతు కోసి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటనలో ఆరు నెలల చిన్న కూతురు మాధురి మరణించింది. మరో కూతురు మహేశ్వరితో పాటు తల్లి కళావతి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఈ సంఘనట స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

బ్లేడుతో ఇద్దరు కూతుళ్ల గొంతు కోసిన కళావతి తన గొంతు కూడా కోసుకుంది. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. కళావతి భర్త కృష్ణా రెడ్డి బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల వాళ్లు ఓ ఇంటిని కూడా కట్టుకున్నారు. గృహప్రవేశానికి కళావతి ఆడ బిడ్డ రాలేదు. అయితే, ఆమె భర్త కృష్ణా రెడ్డి తనకు చెప్పకుండా ఆడబిడ్డ పంక్షన్‌కు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన కళావతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

English summary
A mother tried to kill her two daughters and attempted suicide. This incident took place in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X