గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ దీక్ష శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: రైతు సమస్యలపై 48 గంటల దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష శిబిరానికి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వరుస కడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ తన దీక్షను విరమించనున్నారు. జగన్ దీక్ష విరమణ కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారు. జగన్ దీక్షకు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, అనకాపల్లి ఎంపి సబ్బం హరి, ఎమ్మెల్యలు కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శేషారెడ్డి, బాబూరావు, అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు, దేవగూరి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఇప్పటి వరకు జగన్ దీక్షలో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా జగన్ దీక్షకు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాదులో కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు అందరూ ఆజాద్‌ను కలుస్తుండగా జగన్ వర్గం నేతలు మాత్రం దూరంగా ఉన్నారు.

English summary
Town MPs Sabbam Hari, Mekapati Rajamohan Reddy and MLAs Konda Surekha, Mekapati Chandrasekhar Reddy, Balineni Srinivas Reddy, Sesha Reddy, Baburao, Amarnath Reddy were attended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X