బాబా జీవించి ఉన్నప్పుడు మాదిరిగానే వేడుకలు: ట్రస్టు
బాబా జీవించి ఉన్నప్పుడు ఏవిధంగా అయితే పూజలు, కార్యక్రమాలు నిర్వహించారో ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయని ట్రస్టు అధికారులు పేర్కొన్నారు. గౌతమ బుద్ధుని జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే బుద్ధ పూర్ణిమ కోసం ప్రశాంతి నిలయం (బాబా సమాధి అయిన చోటు)లో భారీ ఏర్పాట్లను చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల కోసం ఇప్పటికే బ్రూనీ, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, సింగపూర్, థాయ్లాండ్, శ్రీలంక, వియత్నాం దేశాల నుంచి దాదాపు 700 మందికి పైగా భక్తులు పుట్టపర్తికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ 24న బాబా మరణించిన తర్వాత విదేశాల నుంచి ఇంత భారీ సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి రావడం ఇదే మొదటిసారి.
బాబా కాలం చేయడంతో పుట్టపర్తి ప్రాభవం తగ్గిపోతున్న తరుణంలో ఈ ప్రాంతానికి యథాస్థాయిని కల్పించేందుకు ట్రస్టు ముమ్మరంగా కృషి చేస్తుంది. భక్తులను ఆకట్టుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నెల ఆరో తేదీన కూడా ట్రస్టు "ఈశ్వరమ్మ జన్మదినోత్సం"ను (సత్య సాయి బాబా తల్లి ఈశ్వరమ్మ పుట్టిన రోజు) నిర్వహించి పేద ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా.. చైర్మన్ లేకుండానే ట్రస్టు సభ్యులు బాబా ట్రస్టును నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవిని ఎప్పటికీ ఖాలీగానే ఉంచాలని ట్రస్టీలు నిర్ణియించారు. బాబా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆ పదివికి బాబానే ఎల్లప్పటికీ చైర్మన్గా ఉండాలనేది వారి భావన.