హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై పంజాగుట్ట పిఎస్‌లో కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కమిటీలోని ఐదుగురు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణ కమిటీపై 418, 153(ఏ), 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇటీవల తెలంగాణకు చెందిన పలువురు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కమిటీ సభ్యులు ఓ ప్రాంతం వారి మనోభావాలను దెబ్బతీసేలా రిపోర్టు తయారు చేశారని తెలంగాణ న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 8వ అధ్యాయంలోని అంశాలు కూడా రాష్ట్రంలోని పలువురి మధ్య రెచ్చగొట్టే చర్యలుగా ఉన్నాయని వారు విన్నవించారు. న్యాయవాదుల పిటిషన్ విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు వారుపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పోలీసులు ప్రత్యేకంగా న్యాయ సలహాలు తీసుకొని చివరకు వారిపై కేసు నమోదు చేశారు.

English summary
Panjagutta police booked case against Srikrishna Committee members on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X