వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో ఆంధ్ర వైద్య విద్యార్థి శ్రీనివాస రెడ్డి అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

China
కాకినాడ: చైనాలో ఓ ఆంధ్ర వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి అనే విద్యార్థి చెట్టుకు ఉరేసుకుని చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శ్రీనివాస రెడ్డి చైనాలోని యాంగ్లూ విశ్వవిద్యాలయంలో మెడికల్ కోర్సు నాలుగో సంవత్సరం చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో అతని చదువు పూర్తి కాబోతోంది. ఈ స్థితిలో అతను మరణించడం కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందుతున్నారు.

శ్రీనివాస రెడ్డి చెట్టుకు ఉరేసుకుని మరణించినట్లు విశ్వవిద్యాలయం డీన్ అతని తల్లికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. తాము ఆత్మహత్య చేసుకుని అతను మరణించాడని భావిస్తున్నామని, దీనిపై విచారణ జరుగుతోందని డీన్ చెప్పారు. శ్రీనివాస రెడ్డి మరణ వార్త వినగానే తల్లి స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి సుబ్బిరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. తాము శ్రీనివాస్ రెడ్డితో చివరిసారి ఆదివారంనాడు ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

English summary
Andhra medical student Srinivas Reddy dead in China. srinivas Reddy belongs to Pedaparthy village of East Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X