చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ క్షేమంగా ఉన్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు: భార్య లత

By Pratap
|
Google Oneindia TeluguNews

Latha Rajinkanth
చెన్నై: రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని ఆయన భార్య లతా రజనీకాంత్ అన్నారు. చెన్నైలోని ఆస్పత్రిలో ఐసియులోకి రజనీకాంత్‌ను ఐసియులోకి మార్చిన నేపథ్యంలో ఆమె గురువారం ఆ వివరణ ఇచ్చారు. రజనీకాంత్ కోలుకుంటున్నారని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. రజనీకాంత్ భోజనం సరిగానే చేస్తున్నారని, విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారని, సందర్శకుల తాకిడి వల్ల ఇంటిలో విశ్రాంతి లభించడం లేదని, అందుకే ఆస్పత్రిలో ఉన్నారని ఆమె వివరించారు. గ్యాస్ట్రో ఇన్‌ఫెక్షన్‌తో రజనీ బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు.

రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందనే వార్తలను ఆమె ఖండించారు. ఊహాగానాలకు, వార్తాకథనాలకు తాను సమాధానం ఇవ్వదలుచుకోలేదని ఆమె చెప్పారు. రజనీకాంత్ త్వరగా కోలుకుని రాణా సినిమా షూటింగులో పాల్గొనాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. రజనీకాంత్ ఆస్పత్రి పాలు కావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో రాశాడు. తాను రజనీకాంత్‌తో మాట్లాడానని, రజనీ భార్యను తాను సంప్రదిస్తున్నానని ఆయన చెప్పారు.

English summary
Latha Rajinikanth, wife of Rajinikanth said "He is doing well". She said that he is eating well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X