వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అనుకూల వైఖరితో వైయస్ జగన్‌కు నష్టం లేదు: పోల్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణ అనుకూల వైఖరి తీసుకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నష్టం ఉండదని పోల్ ఫలితం తెలియజేస్తోంది. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వన్ ఇండియా తెలుగు ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ ఫలితాన్ని బట్టి చూస్తే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్‌కు సీమాంధ్రలో నష్టం జరగదని, రెండు ప్రాంతాల్లోనూ వైయస్ జగన్ తన సత్తా చాటుతారని తేలింది.

జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో లాభపడుతారని 45.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నష్టపోతారని 30.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. తెలంగాణ, సీమాంధ్ర - రెండు ప్రాంతాల్లోనూ నష్టపోతారని 23.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా వైయస్ జగన్‌కు పెద్దగా నష్టం ఉండదని తెలిసిపోతూ ఉన్నది.

కాగా, తెలుగు వన్ ఇండియా పోల్ సర్వేకు ఓ పరిమితి ఉందనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. ఆన్‌లైన్ న్యూస్‌ను చూసే వాళ్లు ఎక్కువగా నగర, పట్టణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారు. దీనివల్ల వన్ ఇండియా తెలుగు పోల్‌కు ఈ పరిమితి ఉందని గ్రహించాల్సి ఉంటుంది.

English summary
Oneindia Telugu poll reveals that there will be no loss to YSR Congress president YS Jagan, if he takes pro - Telangana stand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X