వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల దాడిలో ఎఎఎస్పీ సహా పది మంది పోలీసుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
భువనేశ్వర్: పోలీసులపై ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఒరిస్సా- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో ఝరియాబాగ్‌ ఏఎస్పీ రాజేష్‌ పవార్‌తోపాటు మరో 9 మంది పోలీసులు మృతి చెందారు. కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న పోలీసులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. కూంబింగ్‌లో అలసి వాహనంలో వస్తున్న పోలీసులపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో వాహనం నిలిపివేసిన పోలీసు ల్యాండ్‌మైన్‌ ధాటికి మృత్యువాత పడ్డారు. మరికొందరు పోలీసులు ఈ కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

రాత్రి వేళలో ఈ సంఘటన జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి- కోరాపుట్‌ డివిజన్‌కు ఆనుకుని ఉన్న ఝరియాబాగ్‌ బ్లాక్‌లోని అమాములా-దాతునామా అటవీ ప్రాంతంలోని దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై రాయ్‌పూర్‌కూ సమాచారం అందినట్లు తెలిసింది.

English summary
An additional SP of Chhattisgarh police was among 10 cops feared killed in a Maoist ambush near the Chhattisgarh-Orissa border on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X