జూన్ నుంచి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమ బాట: టిఎన్జివోల నేత స్వామిగౌడ్
జూన్ 5 నుంచి 30వ తేదీ వరకు ఉద్యమ బాట చేపడుతామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వోద్యోగులు జిల్లా పల్లెబాట నిర్వహిస్తారని, హైదరాబాదులో బస్తీ బాట నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలను కలుస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
English summary
TNGOs president Swamy Goud said that Government employees from Telangana will intensify agitation to achieve Telangana state.
Story first published: Thursday, May 26, 2011, 15:56 [IST]