వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూన్ నుంచి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమ బాట: టిఎన్‌జివోల నేత స్వామిగౌడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Swamy Goud
వరంగల్: తాము తెలంగాణ ఉద్యమాన్ని జూన్ నుంచి ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ప్రకటించారు. సంఘం కార్యవర్గ సమావేశానంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇంతకు ముందు తాము తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేశామని, తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. జూన్‌లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

జూన్ 5 నుంచి 30వ తేదీ వరకు ఉద్యమ బాట చేపడుతామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వోద్యోగులు జిల్లా పల్లెబాట నిర్వహిస్తారని, హైదరాబాదులో బస్తీ బాట నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రజలను కలుస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

English summary
TNGOs president Swamy Goud said that Government employees from Telangana will intensify agitation to achieve Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X