వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌కు మూత్రపిండాల మార్పిడి జరగలేదు: ధనుష్ వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
ముంబై: తీవ్ర ఆందోళకు గురైన రజనీకాంత్ అభిమానులకు ఆల్లుడు, నటుడు ధనుష్ ఊరటనిచ్చే మాట చెప్పారు. రజనీకాంత్‌కు మూత్రపిండాల మార్పిడి జరిగిందని చెలరేగిన ఊహాగానాల పట్ల ధనుష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ ఊహాగానాలను ఆయన ఖండించారు. రజనీకాంత్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని, పది రోజుల్లో తిరిగి రాకపోతే రజనీ విరామాన్ని ఆనందిస్తున్నారని అనుకోవాలని ఆయన అన్నారు.

రజనీకాంత్ ఆరోగ్యంపై చెలరేగుతున్న ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. రజనీకాంత్‌కు మూత్రపిండాల మార్పిడి జరగలేదని, త్వరలోనే రజనీకాంత్ స్వయంగా ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. రజనీకాంత్ మరో వారం రోజుల పాటు సింగపూర్‌లోనే ఉండాలని కోరుకుంటున్నామని, దానివల్ల రజనీకి పూర్తి విశ్రాంతి లభిస్తుందని ఆయన అన్నారు. రజనీ మామూలుగా ఆహారం తీసుకుంటున్నారని, వాకింగ్ చేస్తున్నారని, సినిమాలు చూస్తున్నారని, మాట్లాడుతున్నారని ఆయన వివరించారు.

English summary
Die hard fans of megastar Rajinikanth have finally got some respite from worrying about their idol’s health ever since the news of his recovery was made public by his son-in-law and National Award winning actor, Dhanush.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X