బిఎస్ఎన్ఎల్ను లూటీ చేసిన మారన్, ఇంటికి 322 టెలిఫోన్ లైన్లు?
ఆ టెలిఫోన్ లైన్లను అధికార ప్రయోజనాలకు లేదా వాడకానికి ఏర్పాటు చేయలేదు. మారన్ కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల కోసం ఆ టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆయన బోట్ క్లబ్ ఇంటి నుంచి పబ్లిక్ రోడ్ల మీదుగా అన్నా సాలైలోని అరివావాలయం సన్ టీవీ కార్యాలయం వరకు 3.4 కిలోమీటర్ల మేర రహస్య కేబుల్ను ఏర్పాటు చేసింది. సన్ నెట్వర్క్ దయానిధి మారన్ సోదరుడు కళానిధిదనే విషయం అందరికీ తెలిసిందే.
మారన్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేసి విషయాలను 2007 సెప్టెంబ్ర 10వ తేదిన టెలికం కార్యదర్శికి తెలిపింది. మారన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఆ కేబుల్స్ కూడా సాధారణమైనవి కావు, అత్యంత ఖరీదైనవి. వాటిని వీడియో కాన్ఫరెన్సింగ్, భారీ డిజిటల్ డేటాతో ఆడియా వీడియో ట్రాన్స్మిషన్కు ఆ కేబుల్స్ వాడతారు. మారన్ టెలికం మంత్రి కావడంతో సన్ టీవీ వాటికి చెల్లింపులు జరపలేదు, ఉచితంగా పొందింది. ఈ లైన్ల ద్వారా చేసిన కాల్స్ విలువ దాదాపు రూ. 625.5 కోట్లు ఉంటుందని సిబిఐ అంచనా వేసింది. తనపై ఆరోపణలు చేస్తూ కథనాలను ప్రచురించిన మీడియాకు దయానిధి మారన్ నోటీసులు ఇచ్చారు.