హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలాబలాలు ఎంతో స్పీకర్ ఎన్నికతో తెలుస్తాయి: జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగితే ఎవరెవరి బలాబలాలు ఎంతో తెలుస్తాయని ప్రోటెం స్పీకర్ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. రేపు శనివారం స్పీకర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి ప్రోటెం స్పీకర్‌గా నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసు తన దృష్టికి రాలేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆయన ప్రోటోకాల్‌ను తిరస్కరించారు.

ఒక్క రోజు కోసం ప్రోటోకాల్ ఎందుకని తాను తిరస్కరించిట్లు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. శాసనసభ ఆవరణలోకి ఆయన మొదటి గేటు నుంచి కాకుండా రెండో గేటు ద్వారా వచ్చారు. సాధారణంగా శాసనసభ్యులు రెండో గేటు నుంచి ప్రవేశిస్తారు. శాసనసభకు కూడా ఆయన తన సొంత కారులోనే వచ్చారు. పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ విజయమ్మ చేత ఆయన శాసనసభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేయించారు. విజయమ్మతో పాటు శాసనసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా వచ్చారు.

English summary
Protem speaker JC Diwakar Reddy said that the strengths of the parties will be known with election of speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X