హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్యనారాయణ సమైక్యవాది, బొత్స, కెకె దొందు దొందే: గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యవాది అని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశరావు మంగళవారం ఆరోపించారు. ఆయన వల్ల తెలంగాణ ప్రాంతానికి గాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కాని ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంటు ఉపయోగించుకునేందుకు టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు కొత్త నాటకాలు ప్రారభించారన్నారు. గత డిసెంబర్ నెలలో విద్యార్థులపై కేసులు ఎత్తివేయిస్తామంటూ నిరాహార దీక్ష చేసి ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా ఎత్తి వేయించ లేక పోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధం అంటున్న కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు, బొత్స సత్యనారాయణ ఇద్దరు ఇద్దరే అన్నారు.

కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కు అన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలను వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వేరుగా ఖండించారు. జగన్‌ను ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీయే కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. టిడిపి అవిశ్వాస తీర్మానమే ఇందుకు నిదర్శనం అన్నారు.

English summary
YSR Congress party leader Gone Prakash Rao said that PCC president Botsa Satyanarayana is Samaikya Vadi. There is no useful to Telangana with Botsa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X