గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుబ్రహ్మణ్యస్వామిని చూశానంటున్న మహిళ: పరిశోధన చేయాలని విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: తాను దేవుడిని చూశానని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ చెప్పడం సంచలనం సృష్టించింది. తాను సుబ్రహ్మణ్యస్వామిని చూశానని, తాను దేవుడిని చూసిన ప్రాంతంలో ఏదో అతీత శక్తి ఉందని అక్కడ పురవస్తు శాఖ వారు పరిశోధలు చేయాలని ఆమె కోరారు. గుంటూరు జిల్లాకు చెందిన సంజీవరాణి గత 40 ఏళ్లుగా వడ్లమూడిలోని నాగేంద్ర స్వామిని పూజిస్తోంది. ఈ క్రమంలో సంజీవరాణి మంగళవారం నాగేంద్రస్వామికి పూజలు చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు సుబ్రహ్మణ్యస్వామి కనిపించాడని చెబుతోంది. తాను ఓ మూడు నిమిషాల పాటు సుబ్రహ్మణ్యుడిని చూశానని చెబుతోంది. మట్టి రూపంలో కనిపించాడని చెబుతోంది.

తన కుమారుడు తనను లాక్కొని వచ్చారని అంటోంది. సుబ్రహ్మణ్యస్వామి అందంగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడని అంటోంది. పరిశోధకులు అంటున్న గ్రహాంతర వాసులు వేరు, దేవుడు వేరు అని ఆమె సూచిస్తుంది. తాను చూసిన ప్రాంతంలో ఏదో అద్బుత శక్తి ఉందని అక్కడ పరిశోధనలు జరగాలని ఆమె కోరుతున్నారు. పరిశోధనలు జరిపిన పక్షంలో తాను దేవుడిని చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తనకు దేవుడు కనిపించడమే కాకుండా ఓంకారనాదం, ఘంటారావం వినిపించాయన్నారు.

English summary
Devotee Sanjeeva Rani confirmed that she was saw god subrahmanya Swamy yesterday. She was condemned Jana Vignana Vedika stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X