19న హైదరాబాదులో కెసిఆర్ కుటుంబ సభ్యుల వంటా వార్పూ
వంటా వార్పూ కార్యక్రమానికి ముందుస్తు తయారీగా ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో భారీ ప్రచార బహిరంగ సభ జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సభలో తెలంగాణ జెఎసి నాయకులతో పాటు దానిలో భాగస్వాములుగా పార్టీల నాయకులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇంటింటికీ తమ పార్టీ మహిళా కార్యకర్తలు వెళ్లి వంటా వార్పూను విజయవంతం చేయాలని కోరుతారని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల దిగ్బంధం కూడా చేస్తామని, సీమాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా రైల్ రోకో కార్యక్రమం కూడా చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దిమ్మ తిరిగే విధంగా సకల జనుల సత్యాగ్రహ కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
రంగారెడ్డి జిల్లా తాండూరులో తెలుగుదేశం తెలంగాణ ఫోరం నిర్వహించిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభ పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని నాయని నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, తెలుగుదేశం తెలంగాణ ఫోరం రణభేరీ బహిరంగ సభలు వారి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని, అందుకే వాటిని అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు.