ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాలో టిటిసి విద్యార్థిని రేప్ చేసి, హత్య చేసిన దుండగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టిటిసి విద్యార్థినిని దుండగులు రేప్ చేసి, ఆపై హత్య చేశారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ శివారులోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని పొలాల్లో విద్యార్థిని శవం పడి ఉంది. గుర్తు పట్టరానంతగా శవం కుళ్లిపోయింది. ఒంటిపై నూలుపోగు కూడా లేదు.

శవం పక్కన సంచీ, పుస్తకాలు పడి ఉన్నాయి. పుస్తకాలపై పేరు ఆధారంగా ఆమెను హరిప్రియగా గుర్తించారు. ఆమె కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందింది. ఆళ్లగడ్డలో ఓ గదిలో ఉంటూ టిటిసి చదువుతోంది. రెండు రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి ఆళ్లగడ్డకు బయలుదేరింది. ఆళ్లగడ్డకు వచ్చిన వెంటనే ఆమెను దుండగులు మాయం చేశారా, మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారా అనే విషయం తేలడం లేదు.

English summary
A TTC girl student was raped and murdered at Allagadda of Kurnool district. Her dead body was found in fields of Allagadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X