రాజధానిలో పట్టపగలు వేట కొడవళ్లతో నరికి యువకుడి హత్య
విషయాన్ని స్థానికులు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అశోక్పై దాడి చేసి చంపింది ఎవరు అనే విషయంపై పోలీసులు అప్పుడే చెప్పలేమంటున్నారు. విచారణ అనంతరం నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అయితే పాతకక్షల కారణంగానే హత్య చేయవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకు చంపారో కూడా కారణాలు తెలియరాలేదు. కాగా అశోక్ ఒంగోలు జిల్లా వాసి. కొంత కాలం క్రితం తన తల్లిదండ్రులతో హైదరాబాదు వచ్చిన అశోక్ వ్యాపారం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Comments
English summary
Ashok, who came from Ongole was killed in his opposers today in Nizampet of Hyderabad. Police were investigating murder case.
Story first published: Saturday, June 11, 2011, 11:50 [IST]