ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో పట్టపగలు వేట కొడవళ్లతో నరికి యువకుడి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలే వేట కొడవళ్లతో నరికి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. హైదర్‌గూడలోని రాంనరేష్‌నగర్ నివాసి అయిన అశోక్ శనివారం మధ్యాహ్నం నిజాంపేట మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పలువురు దుండగులు వచ్చి ఆయనను బైక్ నుండి తోసి వేసి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ప్రత్యర్థుల దాడిలో అశోక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

విషయాన్ని స్థానికులు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అశోక్‌పై దాడి చేసి చంపింది ఎవరు అనే విషయంపై పోలీసులు అప్పుడే చెప్పలేమంటున్నారు. విచారణ అనంతరం నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అయితే పాతకక్షల కారణంగానే హత్య చేయవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకు చంపారో కూడా కారణాలు తెలియరాలేదు. కాగా అశోక్ ఒంగోలు జిల్లా వాసి. కొంత కాలం క్రితం తన తల్లిదండ్రులతో హైదరాబాదు వచ్చిన అశోక్ వ్యాపారం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Ashok, who came from Ongole was killed in his opposers today in Nizampet of Hyderabad. Police were investigating murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X