హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స టైం టేబుల్: ఉదయం గాంధీభవన్, మధ్యాహ్నం సచివాలయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మంత్రిగా కొనసాగితే తాను ఉదయం పూట పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో, మధ్యాహ్నం సచివాలయంలో ఉంటానని ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. అందుబాటులో ఉన్న పార్టీ కార్యవర్గ సభ్యులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. హైదరాబాదులో ఉంటే తాను తప్పకుండా గాంధీభవన్‌కు వస్తానని ఆయన చెప్పారు. ప్రతి రోజూ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఉంటానని ఆయన చెప్పారు.

పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ తన సొంత జిల్లా విజయనగరంలో తొలిసారి పర్యటించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు తమ తమ విధులు నిర్వహించాలని ఆయన కోరారు.

English summary
PCC president Botsa Satyanarayana will attend Gandhi Bhavan every day. He will come Gandhibhavan in the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X