వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో బోటు షికారుకు వెళ్లి ఆంధ్రా విద్యార్థి గల్లంతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Australia
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థి ఒకరు పడవ షికారుకు గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెంకట తేజ అనే విద్యార్థి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. వెంకట తేజ ఆక్స్ బరి ప్రాంతంలో బొటు షికారు కోసం వెళ్లాడు. బోటు షికారుకు వెళ్లిన వెంకట తేజ గల్లంతయ్యాడు. వెంకట తేజ తన మిత్రులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు.

వెంకట తేజ తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. ఆయన బంధువులు కొందరు మాత్రం జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉంటున్నారు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో వెంకట తేజ మిత్రులు ఫోన్ ద్వారా బంధువులకు గల్లంతయిన సమాచారం అందించారు. దీంతో తేజ కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది.

English summary
Andhra student Venkat Teja disappeared in australia while boating. Venkat proper is Jaggaiahpeta of Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X