వైయస్ జగన్ తలపెట్టిన సాగు పోరు ధర్నాల్లో కాంగ్రెసు ఎమ్మెల్యేలు
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, ఆమె భర్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెసు శాసనసభ్యులు కృష్ణదాస్, పార్వతి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో కాంగ్రెసు శానససభ్యుడు బాబూరావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో వైయస్ జగన్తో పాటు కాంగ్రెసు శాసనసభ్యుడు రవి పాల్గొన్నారు.
కాగా, గుంటూరు జిల్లా కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో అంబటి రాంబాబు, మాకినేని పెదరత్తయ్య పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, పోసాని కృష్ణ మురళి, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.