సైబర్ దాడులకు గురవుతున్నఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్
''ఓ ఘటనపై మేం దర్యాప్తు జరుపుతున్నాం. సంస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు. సంక్షోభాలకు చేరువలో ఉన్న కొన్ని దేశాలకు సంబంధించిన సున్నితమైన డేటా ఐఎంఎఫ్ వద్ద ఉంది. ఇందులో మార్కెట్ను పెనుమార్పులకు లోనుచేసే సమాచారంతోపాటు దేశాల నేతలతో జరిపిన సంభాషణలు, వారితో సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలు ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ సమాచారం రాజకీయ డైనమైట్లా పనిచేస్తుందని ఐఎంఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే తాజా సైబర్ దాడుల్లో ఎలాంటి సమాచారాన్ని తస్కరించారన్నది తెలియరావడంలేదు.
ఈ ఘటనతో బెంబేలెత్తిన ప్రపంచ బ్యాంకు.. ఐఎంఎఫ్తో సమాచారాన్ని మార్పిడి చేసుకునే లింక్ను తెగతెంపులు చేసింది. ఏ దేశం నుంచి దాడి జరిగిందన్నది కూడా స్పష్టంకాలేదు. స్పియర్ ఫిషింగ్ అనే పద్ధతి ద్వారా సైబర్ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇందులో ఒక అక్రమ వెబ్ లింక్ను పంపడం ద్వారా ఐఎంఎఫ్ అధికారిని బోల్తా కొట్టిస్తారు. దీన్ని క్లిక్ చేస్తే సదరుకంప్యూటర్లోని డేటా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది.