వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత కాలం జైలులోనే కనిమొళి, బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి మరింత కాలం జైలులోనే ఉండాల్సి వస్తోంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టులో పెండింగులో కేసు స్థితికి సంబంధించిన వివరాలను తనకు అందజేయాలని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ సిబిఐని ఆదేశించింది. కలైంగర్ టీవీకి చెల్లించినట్లు భావిస్తున్న 200 కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటని కూడా కోర్టు సిబిఐని అడిగింది.

గత నెల 20వ తేదీ నుంచి నిందితులను ఎందుకు విచారించలేదని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. కలైంగర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా 20వ తేదీకి వాయిదా పడింది. తమకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో కనిమొళి, శరద్ కుమార్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కనిమొళిని, శరద్ కుమార్‌ను సిబిఐ గత నెల 20వ తేదీన అరెస్టు చేసింది.

English summary
The Supreme Court has adjourned the bail plea of DMK MP Kanimozhi to June 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X