కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అధికారంలోకి రావాలి!: వైయస్ విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సాగుపోరు దీక్షలో భాగంగా వైయస్ విజయమ్మ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు వెన్నుదన్నుగా ఉండేవారన్నారు. ఆయన మరణించిన తర్వాత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రైతులకు న్యాయం జరగాలంటే జగన్ రావాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటే ప్రభుత్వం సిగ్గు పడాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు వైయస్ విజయమ్మ, ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

English summary
Pulivendula MLA YS Vijayamma called public to support ysr congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X