హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వృద్ధ మహిళను కత్తులతో బెదిరించి 10 తులాల బంగారం దోపిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దొంగతనాలు, కిడ్నాప్ తదితర వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలతో హైదరాబాద్ క్రైం సిటీగా మారిపోయింది. ప్రతి రోజు ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. తాజాగా బుధవారం ఉదయం మాదాపూర్‌లోని పర్వతనగర్‌లో వృద్ధ మహిళను బెదిరించి ఆమె మెడలో నుండి 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఇంటి ముందు ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెతో కాసేపు మాట్లాడారు. అ తర్వాత కత్తులతో బెదిరించి ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం పట్టపగలే ఉప్పల్‌లో ఓ మహిళను బెదిరించి మరో దుండగుడు మెడలోని రెండు తులాల బంగారాన్ని లాక్కుని పారి పోయాడు.

కాగా మంగళవారం ముంబయి వ్యాపారస్తులను బెదిరించి 5 కిలోల బంగారాన్ని దోచుకున్న దుండగులను పోలీసులు ఒక రోజులోపే చేధించారు. దుండగులను అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో పోలీసులు పట్టుకొని వారి వద్ద నున్న 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. కాగా మూడు రోజుల క్రితం ఓ సైంటిస్టు తనయుడుని కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.

English summary
Thieves attacked on old woman and theft 10 grams gold in Madhapur of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X