వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సున్నితమైంది, నేతలతో మాట్లాడుతున్నాం: జయంతీ నటరాజన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayanthi Natarajan
న్యూఢిల్లీ: తెలంగాణ సున్నితమైన విషయమని ఎఐసిసి అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ అన్నారు. తెలంగాణ అంశంపై ఆందోళనకు దిగుతున్న తమ పార్టీ తెలంగాణ నాయకుల విషయం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చూసుకుంటారని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అధిష్టానం పెద్దలతో తమ పార్టీ తెలంగాణ నాయకులు చేస్తున్న చర్చలు పార్టీ అంతర్గత విషయమని, బయటకు చెప్పలేమని ఆమె అన్నారు.

రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులతో తమ పార్టీ అధిష్టానం నాయకులు చర్చిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఢిల్లీలో మకాం వేసి ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.

English summary
AICC spokes person Jayanthi Natarajan said that Telangana is a delicate issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X