ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ప్రియుడిని చంపిన ప్రియురాలి బంధువులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adilabad District
అదిలాబాద్: జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని ప్రేమించిన ఓ యువకుడికి యువతి బంధువులు బలవంతంగా కూల్ డ్రింక్ బాటిల్లో పురుగుల మందు ఇచ్చి చంపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మంచిర్యాల మండలం గడ్ఫూర్ గ్రామానికి చెందిన కిరణ్ గత సంవత్సరం ఓ పెళ్లిలో స్రవంతి అనే అమ్మాయిని చూశాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. అయితే కిరణ్ తన తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పడంతో కిరణ్ తల్లిదండ్రులు వెళ్లి స్రవంతి తల్లిదండ్రులను పెళ్లి చేయవలసిందిగా అడిగారు.

దానికి స్రవంతి తల్లిదండ్రులు అమ్మాయి చదువు తర్వాత పెళ్లి చేద్దామని చెప్పారు. అయితే ఆ తర్వాత స్రవంతికి ప్రసాద్ అనే మరో యువకుడితో పెళ్లి చేశారు. అయితే తన ప్రేమను మరిచిపోని కిరణ్ స్రవంతికి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ప్రసాద్ సోదరుడు శ్రీనాథ్ గురువారం కిరణ్‌ను తీవ్రంగా కొట్టాడు. అయితే గ్రామస్తులు సర్ది చెప్పడంతో శ్రీనాథ్ వెళ్లి పోయినప్పటికీ తిరిగి శుక్రవారం వచ్చి కిరణ్‌ను పక్కనే ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి బలవంతంగా స్ప్రైట్ బాటిల్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. గమనించిన గ్రామస్తులు కిరణ్‌ను హాస్పిటల్ తరలించేలోగా మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Lover's relatives killed person today at Manchirayala of Adilabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X