హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడిన జైపాల్ రెడ్డి కోడలి హత్య మిస్టరీ: భర్త చైతన్య రెడ్డి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు డాక్టర్ కిరణ్ రెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కిరణ్ రెడ్డి భర్త చైతన్యనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతను తీవ్రంగా కొట్టడం వల్లనే కిరణ్ రెడ్డి మరణించినట్లు పోస్టు మార్టం ద్వారా పోలీసులు తేల్చి చెప్పారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు చైతన్య రెడ్డిని విచారించారు. తాను కొట్టినట్లు చైతన్య ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో కిరణ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి అనంతరం తన కూతురును భర్తే హత్య చేసి ఉంటాడని కిరణ్ రెడ్డి తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. మృతికి ముందు చైతన్య రెడ్డి బావమరిదితో గొడవ బడి చైతన్యను హడావుడిగా ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటి తీసుకు వచ్చిన కిరణ్ రెడ్డిని కొట్టాడు.

దిండును ఊపిరి ఆడకుండా అడ్డం పెట్టడంతో కిరణ్ రెడ్డి మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ విషయంపై మాట్లాడని చైతన్య రెడ్డి బుధవారం తాను కొట్టినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు చైతన్యను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అయితే మరోవైపు ఆయన మీడియాలో తాను చంపానన్న విషయాన్ని ఖండించారు. తాను తన భార్యను ప్రాణంగా ప్రేమించానని అన్నాడు. తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించారని చెప్పాడు. తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నాడు.

English summary
Police were busted Minister Jaipal Reddy's daughter-in-law Kiran Reddy murder mystery. Police arrested Kiran Reddy's husband Chaitanya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X