హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి ట్రస్టుకు జగన్‌కు సంబంధం: అనుమానం వ్యక్తం చేసిన టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలపై తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సాయి ట్రస్టుకు బుధవారం జగన్ వెళ్లడాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పి.చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నారు. గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ఎందుకు వెళ్లారో బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశాంతి నిలయంకు వచ్చిన జగన్‌ను రత్నాకర్ దగ్గరుండి మరి తోడ్కొని తీసుకు వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నారు. రత్నాకర్, జగన్ మధ్య ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాగా సత్యసాయి బాబు మహా సమాధి పూర్తయ్యే వరకు అక్కడకు సామాన్య భక్తులతో పాటు వివిఐపిలను కూడా అనుమతించమని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బుధవారం జగన్‌ను రత్నాకర్ దగ్గరుండి సమాధి వద్దకు తీసుకు వెళ్లారు. జగన్ అంగరక్షకులు చెప్పులతో వెళ్లారన్న వివాదం కూడా చుట్టుముట్టింది.

English summary
TDP senior leader P.Chandrasekhar suspecting that links between YSR Congress party president YS Jaganmohan Reddy and Sathya Sai Trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X