రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై సామూహిక అత్యాచారం: మరోచోట చిన్నారిపై ఆటోడ్రైవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
విశాఖపట్నం/రాజమండ్రి: ఓ యువతిపై అత్యాచారం, మరో బాలికపై అత్యాచారయత్నం చేసిన సంఘటనలు విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. సింహాచలం రైల్వే స్టేషన్‌లో ఒక యువతిపై నలుగురు యువకులు కలిసి అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన యువతిది నిజామాబాద్ జిల్లా. యువతి కుటుంబ సభ్యులు జీవనాధారం కోసం నిజామాబాద్ నుండి విశాఖపట్నం వచ్చారు. స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని స్థానికి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అత్యాచారం చేసిన దుండగులు పరారీలో ఉన్నారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో పదకొండేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు గురువారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను ప్రాథమిక పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

English summary
Four mer reaped young lady today at Simhachalam railway station of Vishakaptnam district. Victim came from Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X