హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్ట్రేలియాలో గల్లంతైన ఆంధ్రా విద్యార్థి వెంకట తేజ మృత దేహం లభ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Australia
హైదరాబాద్: పది రోజుల క్రితం ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి హాక్స్ బరీ నదిలో విహారానికి వెళ్లిన ఆంధ్రా యువకుడు వెంకట తేజ మృతదేహం గురువారం లభించింది. వెంకట తేజ మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 12న జరిగిన వెంకటతేజ హాక్స్‌బరీ నదిలో వైజ్‌మ్యాన్స్‌ ఫెర్రీ సమీపంలో స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లి అలల తాకిడికి పడవ తిరగపడి గల్లంతయ్యారు. వెంకట తేజ హైదరాబాదులోని షేక్‌పేట వాసి. వెంకట తేజతో పాటు విజయవాడకు చెందిన కార్తీక్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన ఢిల్లీకి చెందిన అమిత్ గల్లంతయ్యారు.

అయితే కార్తీక్ ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డాడు. అమిత్, వెంకట తేజ మృతి చెందారు. అమిత్ మృత దేహం మంగళవారం లభించింది. ఆయనకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట తేజ మృతదేహం గురువారం లభించింది. వెంకట తేజ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా మాచర్ల కేసీపీ కర్మాగారాల ఉపాధ్యక్షుడు జి.వి.కె.ప్రసాద్‌ పెద్ద కుమారుడు.

English summary
Venkata Teja dead body found yester day. Venkata Teja missed by his trip in Hoxborry river with his friends on june 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X