వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి కార్పోరేటర్, తూగోలో కాంగ్రెసు కార్యాలయం స్వాధీనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijay Kumar
హైదరాబాద్/కరీంనగర్: వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ పార్టీలోకి సీతాఫల్‌మండి కార్పొరేటర్ విజయ్‌కుమార్ ఆదివారం చేరినట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల పట్ల విసుగు చెంది జగన్ నాయకత్వంలో పనిచేసేందకు సిద్ధపడినట్లు విజయ్‌కుమార్ తెలిపారు.

కాగా తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకున్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కాంగ్రెసు జెండాలను తొలగించి తమ పార్టీ జెండాలను పెట్టారు. దీంతో ఇరువరి మధ్య కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కరీంనగర్ జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని తెలంగాణవాదులు ముట్టడించి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారిని వైయస్ఆర్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు కలుగ జేసుకొని సద్దుమణిగేలా చేశారు.

English summary
Seethafalmandi carporator Vijay Kumar was joined in YSR Congress party today. He said he is ready to work under Jagan's leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X