ఇతరులతో తిరగవద్దన్నందుకు భర్తను చంపిన భార్య: బయటపెట్టిన కూతురు
భర్త మందలింపును సహించని భార్య అంజుల ఐదు రోజుల క్రితం ఈ నెల 21న రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆయన చేతులు కట్టి వేసింది. ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆ హత్యను సహజమరణంగా చిత్రీకరించింది. తనకు ఏమీ తెలియనట్టు బంధువులకు, చుట్టుపక్కల వారికి ఏడ్చుకుంటూ చెప్పింది. అయితే ఆదివారం వారి కూతురు సోనీ అసలు విషయం బయట పెట్టింది. తన తండ్రిని తల్లే హత్య చేసిందని చెప్పింది.
తన తండ్రి మరణాన్ని కళ్లారా చూసినప్పటికీ తాను ఆ విషయాన్ని బయట పెడితే తనను కూడా చంపేస్తానని తల్లి బెదిరించిందని చెప్పింది. అయితే మనసులోనే తల్లి దుర్మార్గాన్ని దాచుకోలేని సోని తన పిన్నికి ఈ విషయం చెప్పింది. బంధువులు అంతా కలిసి అంజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందు అంజుల తప్పు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
Comments
English summary
Wife Anjula killed her husband Wilson in LB Nagar of Hyderabad. She killed on 21st mid night. Her daughter Sony was told to police today.
Story first published: Sunday, June 26, 2011, 15:29 [IST]