సత్య సాయిబాబాబా సామ్రాజ్యానికి అరబిందో నమూనా, ప్రభుత్వ స్వాధీనం?
ట్రస్టును స్వాధీనం చేసుకుని అడ్మినిష్ట్రేటర్ ద్వారా నడిపించాలనే విషయంపై ప్రభుత్వం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా ట్రస్టును స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుందా, లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సత్య సాయి బాబా మరణం తర్వాత శ్రీ అరబిందో సొసైటీ మదర్ మేడమ్ ఎఁ అల్పాస్సీ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులే పుట్టపర్తిలో నెలకొన్నాయి. ఈ స్థితిలో 1988లో కేంద్ర ప్రభుత్వం అరబిందో సొసైటీని స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం శ్రీ సత్య సాయి బాబా సెంట్రల్ ట్రస్టు సంపద తరలింపు కేసులో నిండా మునిగిపోయి ఉంది. ట్రస్టు సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే రత్నాకర్ను పోలీసులు విచారించారు. శ్రీనివాసన్కు సమన్లు జారీ అయ్యాయి. ఈ స్థితిలో ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.