అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా కారణంగా ట్రస్టుపై ఆందోళన: నాగానంద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: సత్యసాయి ట్రస్టు వ్యవహారాలపై అందరూ ఆసక్తితో, ఆందోళనతో ఉన్నారని ట్రస్టు సభ్యుడు నాగానంద్ మంగళవారం మధ్యాహ్నం ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ట్రస్టు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సభ్యులంతా మీడియా సమావేశానికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. ట్రస్టు ఆస్తులు ప్రతి సంవత్సరం వెల్లడించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సత్యసాయి ట్రస్టు వ్యవహారాలపై అందరూ ఆసక్తితో, ఆందోళనతో ఉన్నారని అన్నారు. నిరాధారమైన కథనాలు రాసి భక్తుల్లో ఆందోళన కలిగించ వద్దని మీడియాకు సూచించారు. కొన్ని పత్రికలు ట్రస్టుపై అసత్యాలు ప్రచురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాకు వైద్య సేవలు అందించిన డాక్టర్ సఫాయా రాజీనామా చేయలేదని, ఆయన వయసు రీత్యా విశ్రాంతి కోరుకున్నారని అందుకే సేవలకు దూరం అయ్యారని చెప్పారు. ట్రస్టులో ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలే చేపడతామని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. బాబా ఎలాంటి వీలునామా రాయలేదని చెప్పారు. కాగా మీడియా కో ఆర్డినేటర్‌గా ట్రస్టు అనంత రామన్‌ను నియమించింది.

English summary
Sathya Sai Trust member Srinivasan said that there is no illegal activities in Sathya Sai seva trust. He said no differences in trust members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X