టార్గెట్ కెసిఆర్: రక్తపుటేరులపై టి-కాంగ్రెసు ఆగ్రహం
మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ఏకంగా కెసిఆర్కు హైదరాబాద్ దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరించారు. మెట్రో రైలును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మెట్రో రైలు కారణంగా మొజంజాహీ మార్కెట్, ఆర్య సమాజ్, సుల్తాన్ బజార్ తదితర చారిత్రక ప్రదేశాలకు నష్టం లేకున్నప్పటికీ కెసిఆర్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కెసఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరో మంత్రి గీతారెడ్డి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మెట్రో రైలు కోసం ముఖ్యమంత్రి ఎలాంటి డబ్బులు తీసుకోలేదన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తెలంగాణకు కట్టుబడి ఉన్నారని అన్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సాకె శైలజానాథ్ కూడా కెసిఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ ఉద్యమం పేరుతో అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. కెసిఆర్ అధికార కాంక్షతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో రెచ్చగొట్టి సొమ్ము చేసుకుంటుందని అన్నారు.