మంత్రి పదవికి చిరంజీవి కొంత కాలం ఆగాల్సిందే
పునర్వ్యవస్థీకరణ
ఎప్పటిలోగా
పూర్తవుతుందని
ప్రశ్నించినప్పుడు
''నేను
ఊహించలేను''
అని
సమాధానమిచ్చారు.
పార్లమెంటు
వర్షాకాల
సమావేశాలు
ఆగస్టు
1
నుంచి
ప్రారంభమవుతున్న
నేపథ్యంలో
జులై
నెలలోనే
పునర్వ్యవస్థీకరణ
జరుగుతుందని
సంపాదకులు
భావిస్తున్నారు.
పునర్వ్యవస్థీకరణలో
భారీ
మార్పులు
ఉండవని
కూడా
చెబుతున్నారు.
ఖాళీలను
భర్తీ
చేయడంతో
పాటు,
ఒకటి
కంటే
ఎక్కువ
మంత్రిత్వ
శాఖలు
నిర్వహిస్తున్న
వారికి
భారం
తగ్గించి,
వారి
అదనపు
శాఖకు
కొత్తగా
మంత్రిని
నియమిస్తారని
చెబుతున్నారు.
ఏఐసీసీ
వర్గాలు
మాత్రం
మంత్రివర్గం
నుంచి
కొందరిని
తొలగించవచ్చని
అంటున్నాయి.
మంత్రిపదవి కోల్పోయే వారిలో డి.కె.హండిక్, మురళీదేవ్రా, కాంతిలాల్ భూరియాలు ఉండొచ్చని చెబుతున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారిస్తారని భావిస్తున్నారు. మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు నిర్వహిస్తున్న బేణీ ప్రసార్ వర్మకు పూర్తిస్థాయి కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. అలాగే సినీనటుడు రాజ్బబ్బర్కు తొలిసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కవచ్చంటున్నారు.