అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గురుపౌర్ణమి నుండి సత్యసాయి సమాధి దర్శనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: భగవాన్ సత్య సాయి బాబా మహాసమాధి నిర్మాణం ఈ నెల 14 నాటికి పూర్తవుతుందని, గురుపౌర్ణమి రోజైన 15వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు నాగానంద శనివారం విలేకరులకు తెలిపారు. సర్వమత సారాన్ని చాటేలా మహా సమాధిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వాస్తు శిల్పుల పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయని తెలిపారు.

సమాధి నిర్మాణానికి మార్బుల్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి విగ్రహాన్ని బాబా జయంత్యుత్సవాల నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. కాగా సత్య సాయి బాబాను దర్శించుకునేందుకు భక్తులు వేచి చూస్తున్నారు. మహాసమాధి నిర్మాణం తర్వాత భక్తులు భారీగా తరలి వెళ్లనున్నారు. షిర్డీ సాయి కంటే ఘనంగా పుట్టపర్తిని ప్రఖ్యాతి పొందేలా చేస్తామని ట్రస్టు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Bhagvan Sathya Sai Baba samadhi will complete on 14 of this month. Devotees will come from 15th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X