సర్దుకుపోదాం, మేడం మాటగా చెప్తున్నా: అహ్మద్ పటేల్
తెలంగాణ సమస్య చాలా సున్నితమైందని, తాము లోతుగా పరిశీలిస్తున్నామని, తొందరపడడం మంచిది కాదని చెప్పినట్లు అహ్మద్ పటేల్ కాంగ్రెసు ఎంపిలతో చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మరోసారి అహ్మద్ పటేల్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో, మంత్రులతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి సారయ్య చెప్పారు. జైపాల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతుగా పాత్ర నిర్వహించాలని కోరడానికి తాము జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చామని, అయితే అదే సమయంలో అహ్మద్ పటేల్ ఇక్కడికి వచ్చారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.
ప్రజాప్రతినిధుల రాజీనామాల గురించి తాము అహ్మద్ పటేల్కు, ఆజాద్కు చెప్పామని పార్లమెంటు సభ్యుడు వివేక్ చెప్పారు. ఈ రాత్రి మాత్రమే చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ తమకు ఏమీ చెప్పలేదని ఆయన అన్నారు. కాకతాళీయంగా మాత్రమే అహ్మద్ పటేల్తో కలిశామని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. రాజీనామాల విషయమే తాము అహ్మద్ పటేల్కు చెప్పామని ఆయన అన్నారు.