చంద్రబాబు ఓకె అంటే తెలంగాణ వస్తుంది: నాగం
చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతలతో నాటకాలు ఆడించడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలే తెలంగాణ నేతల అధిష్టానం అన్నారు. తెలంగాణ సాధనకు తెలంగాణ మొత్తం ఏకమై కదలుతోందన్నారు. తమ రాజీనామా సెగలు ఢిల్లీకి తగిలాయన్నారు. కొంతమంది తెలంగాణ ద్రోహులు తప్పించి మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేశారని అన్నారు. రాజీనామా చేయని వారిపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. రాజకీయ సంక్షోభంతోనే తెలంగాణ వస్తుందన్నారు. హైదరాబాదులో తెలంగాణ వాదం లేదనే విషయం అవాస్తవమన్నారు. తమ దీక్షకు రాజధానిలోని అన్ని ప్రాంతాల నియోజకవర్గాల నుండి ప్రజలు వచ్చారని అన్నారు.
కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటన సరికాదన్నారు. ఆయన తన ధోరణి మార్చుకోవాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారన్నారు. 1972లో జై తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి జై ఆంధ్ర ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందన్నారు. చిరంజీవితో కలవడానికి రక్షణ శాఖ మంత్రిని పంపిన అధిష్టానం తెలంగాణలో ఇంతమంది రాజీనామాలు చేస్తే పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. మా నియోజకవర్గాల్లో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు. మేం చట్టాలు చేసే వాళ్లమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కబడ్దార్ అంటూ హెచ్చరించారు. విద్యార్థులపై కిరణ్ ప్రభుత్వం దమనకాండను ఆపాలన్నారు.