వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలన దిశగా కాంగ్రెసు కదలిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ‌‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశగా కదులుతున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు అధిష్టానం ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు సమాచారం. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోటి వద్దని తెలంగాణ కాంగ్రెసు నాయకులు తేల్చి చెప్పడంతో అధిష్టానం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపులకు తాము వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించి సంప్రదింపులు జరపాలని, ఆ సంప్రదింపులు రాష్ట్ర విభజన కోసమే జరగాలని తెలంగాణ నాయకులు పార్టీ అధిష్టానానికి చెబుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు ఇప్పటికిప్పుడు సిద్ధంగా లేదు.

కాగా, తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల వద్ద కాంగ్రెసు అధిష్టానం నాలుగు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, రాష్ట్రపతి పాలన అనే రెండు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును తాము అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ నాయకులు అంటున్నారు. దీంతో నాలుగో ప్రతిపాదన రాష్ట్రపతి పాలనే అంతిమం కానుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌పై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది. శ్రీకృష్ణ కమిటీని వేసి నివేదిక తెప్పించుకున్న తర్వాత, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా మళ్లీ ఏకాభిప్రాయ సాధన, విస్తృత స్థాయి సంప్రదింపులు అని అధిష్టానం అనడాన్ని తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

English summary
It is said that Congress high command is moving towards president rule in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X